తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ త్వరలోనే కొందరికి షాక్ ఇవ్వబోతున్నారు.కెసీఆర్ షాక్ ఇవ్వడమంటే ఇతర పార్టీల నాయకులను గులాబీ పార్టీలో చేర్చుకోవడమే.
ఇదే అందరికీ ఉన్న అభిప్రాయం.ఇది నిజమే అయినా ఇప్పుడు ఆయన ఇవ్వబోయే షాక్ ప్రతిపక్షాలకు కాదు.
తన సొంత పార్టీ నాయకులకే.ఏమిటి ఈ షాక్? త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు.అంటే కొందరు మంత్రులను తీసివేయడం, కొందరిని చేర్చుకోవడం.
ఈ ప్రక్రియ రాజ్యసభ ఎన్నికల తరువాత జరుగుతుందని సమాచారం.ఆరుగురు మంత్రులను తీసేస్తారని తెలుస్తోంది.వీరు ఎవరనేదానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
వరంగల్ జిల్లా నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావ్ పేరు కొత్త మంత్రుల జాబితాలో ప్రముఖంగా వినబడుతోంది.పార్టీలో చేరే సమయంలోనే కెసీఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు.
అదే జిల్లా నుంచి కొండా సురేఖ పేరు కూడా వినబడుతోంది.
ఆదిలాబాద్ నుంచి కోవా లక్ష్మి, మెదక్ నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
కొప్పుల ఈశ్వర్కు అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.ప్రస్తుతం సలహాదారుగా ఉన్న డి శ్రీనివాసును రాజ్యసభకు పంపుతారని అలా కుదరకపోతే మంత్రిని చేస్తారని సమాచారం.
ఇక జోగు రామన్న, నాయిని నరసింహా రెడ్డి, పద్మా రావ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ పదవులకు ఎసరు పెడతారని అనుకుంటున్నారు.ప్రస్తుతం ఇవి ఊహాగానాలే.
కెసీఆర్ మనసులో ఏముందో మరి.