నేడు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకి రాజుకుంటోంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

 Telangana Bjp State Executive Committee Meeting Today  Telangana, Bjp, Cm Kcr ,-TeluguStop.com

ఎవరికివారు ఢిల్లీలో ఉన్న నేతలకు లెటర్లు రాస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జలాలలో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.

కృష్ణానది జలాల లో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలి అంటే కేఆర్ఏంబి పరిధిని పెంచాలని అంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి  బండి సంజయ్ లెటర్ రాయడం జరిగింది.

  నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ  కార్యవర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో జలవివాదంతో పాటు  ఇతర అంశాలపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇంకా పార్టీ కార్యవర్గ సమావేశాలు గురించి  రాష్ట్ర బీజేపీ నాయకులు చర్చించనున్నట్లు సమాచారం.

అదే రీతిలో కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే రీతిలో ఈ పార్టీ సమావేశంలో నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube