రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకి రాజుకుంటోంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఎవరికివారు ఢిల్లీలో ఉన్న నేతలకు లెటర్లు రాస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జలాలలో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.
కృష్ణానది జలాల లో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలి అంటే కేఆర్ఏంబి పరిధిని పెంచాలని అంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి బండి సంజయ్ లెటర్ రాయడం జరిగింది.
నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో జలవివాదంతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇంకా పార్టీ కార్యవర్గ సమావేశాలు గురించి రాష్ట్ర బీజేపీ నాయకులు చర్చించనున్నట్లు సమాచారం.
అదే రీతిలో కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే రీతిలో ఈ పార్టీ సమావేశంలో నాయకులు చర్చించనున్నట్లు సమాచారం.
.