కేసీఆర్ చాలా ముందు చూపు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పటికే ఆయన ఎన్నో రకాల వ్యూహాలతో సీఎం కుర్చీపై కూర్చున్నారు.
ఇలాంటి తరుణంలో ఆయన మరో వ్యూహం అమలు చేస్తున్నారు.అదేనండి ఆయన ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో సంగతి తెలిసిందే కదా.
అయితే ఇక్కడే ఆయనకు చేస్తున్న పనులు తెలంగాణ బీజేపీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి.అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు.
ఆయన అక్కడ ఏం చేస్తున్నారనే కోణంలో ఇక్కడి నేతలు చర్చలు జరుపుతున్నారు.ఇప్పటికే దీనిపై రాష్ట్ర బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎందుకంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలిపోయింది.ఇక ఆయన వరుస బెట్టి ప్రధాని మోడీని, అమిత్ షాను, అలాగే కేంద్ర పెద్దలను కలుస్తున్నారు.
దీంతో అసలు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారో అనే రాష్ట్ర కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు.వాస్తవానికి సీఎం కేసీఆర్ అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారనే దానిపై స్పష్టమైన ఊహాగానాలు లేవు.
ఎందుకంటే ఆయన ఢిల్లీలో టీఆర్ ఎస్ బిల్డింగ్కు శంకు స్థాపన చేసేందుకు వెళ్లి వెంటనే రావాల్సి ఉన్నా కూడా అక్కడే ఉండిపోయారు.
అయితే ఆయన వరుసగా ఢిల్లీ బీజేపీ పెద్దలను కలుస్తుంటే ఆ పరిణామాలను ఏమీ లేదు రాష్ట్ర బీజేపీ నేతలు తీసేసే పరిస్థితులు లేదు.ఎందుకంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది.దీంతో ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పనులు మాజీ మంత్రి ఈటలను ఓడించేందుకు వ్యూహాలు చేస్తుండంతోపాటు ఇదే క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలను కూడా ఇరకాటంలో పడేస్తున్నారు.
ఈ ఉప ఎన్నిక వాయిదా పడటం బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.ఇక కేసీఆర్ కూడా నిధులు ఇవ్వమని అడుగుతున్నారు.ఇవ్వక పోతే రాష్ట్రానికి వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరినా ఇ్వట్లేదని జనాల్లో వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో పడుతారు.ఇలా ఎటు చూసుకున్నా కేసీఆర్ టూర్ బీజేపీ నేతలను ఇరకాటంలో పడేస్తోంది.