తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారానికి వెళ్లనున్న తెలంగాణ బీజేపీ చీఫ్.. ?

తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈ ఎన్నికలో విజయాన్ని ఆశిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపిరిని అందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తిరుపతి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేసిందట.

 Telangana Bjp Chief Bandi Sanjay Will Campaign In Tirupati By Election, Telangan-TeluguStop.com

ఇందులో భాగంగా, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేశారని సమాచారం.కాగా తిరుపతి ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో సహా పలువురు సినీ స్టార్లు కూడా పాల్గొనేలా వ్యూహన్ని రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.

ఇకపోతే ఈ ఎన్నికల నేపధ్యంలో బండి సంజయ్ రెండు రోజుల పాటు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహిస్తారని, ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

మరి బండి హస్త వాసి తిరుపతిలో ఏమేరకు కలసి వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube