తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈ ఎన్నికలో విజయాన్ని ఆశిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపిరిని అందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తిరుపతి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేసిందట.
ఇందులో భాగంగా, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేశారని సమాచారం.కాగా తిరుపతి ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో సహా పలువురు సినీ స్టార్లు కూడా పాల్గొనేలా వ్యూహన్ని రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
ఇకపోతే ఈ ఎన్నికల నేపధ్యంలో బండి సంజయ్ రెండు రోజుల పాటు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహిస్తారని, ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.
మరి బండి హస్త వాసి తిరుపతిలో ఏమేరకు కలసి వస్తుందో చూడాలి.