తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.
తెలంగాణలో ప్రజలు బిజేపి వైపు చూస్తున్నారు.దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఓసారి చూసినట్లు అయితే ఆ విషయం స్పష్టం అవ్వుతుందని అన్నాడు.
తెలంగాణలో కేసిఆర్ కుటుంబ పాలన నడుస్తుందని అంతులేని అవినీతికి ఆ కుటుంబం పాల్పడిందని బండి ఆరోపించాడు.త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతాను అన్నాడు.
టిఆర్ఎస్ పార్టీ నుండి కేసిఆర్ తర్వాత కేటిఆర్ ముఖ్యమంత్రి అవ్వుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ వివరణ ఇచ్చాడు.మరో ముడెండ్లు కేసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు.
కేటిఆర్ ను సిఎం చేసే ఆలోచన కేసిఆర్ కి లేదని అన్నాడు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రలో బిజేపి అధికారంలోకి వస్తుందని బండి ధీమా వ్యక్తం చేశాడు.