తెలంగాణాలో నేటి నుంచి (శనివారం ) ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందించే అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓపీతో పాటు ఐపీ సేవలనూ నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్వర్క్ హస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్లు విడుదలలో జాప్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.ప్రభుత్వం గురువారం రూ.150 కోట్లు విడుదల చేసినా వీరు మెట్టు దిగలేదు.దీనికి ఆరోగ్యశ్రీ సీఈవో వైఖరి కూడా కారణమని తెలుస్తోంది.