తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రైవేట్ డ్రైవర్లను ఉపయోగించి బస్సులు నడిపిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేసేది లేదంటూ చెప్పడంతో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులను స్వచ్చంద పదవి విరమణ చేసిన వారిగా గుర్తించాలని ఆర్టీసి అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెల్సిందే.తాజాగా మరోసారి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ స్పందించారు.
ఆర్టీసీ కార్మికులతో అస్సలు చర్చలు జరిపేది లేదు అంటూ తేల్చి చెప్పాడు.వారివి న్యాయబద్దమైన కోర్కెలు అయితే ఖచ్చితంగా పరిశీలించేవాళ్లం.కాని వారి కోర్కెలను ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసి భరించలేదు.దానికి తోడు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసినంత మాత్రాన వచ్చే లాభం ఏమీ లేదు.
అలాంటప్పుడు ఎందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు.ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని, ఆ తర్వాత చర్చలు జరుపుదాం అంటూ కొందరు టీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
కాని ఆర్టీసీ కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగడం ఖాయం అంటున్నారు.