సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా కాస్టింగ్ కౌచ్ భాగోతంపై హీరోయిన్స్, ఇతర నటీమణులు తమ గొంతుక వినిపిస్తున్నారు.హాలీవుడ్ లో స్టార్ అయిన మీటూ ఉద్యమం అలా టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు వచ్చేసింది.
నటి శ్రీరెడ్డి ఈ వ్యవహారాన్ని కొంత కాలం సీరియస్ గా నడిపించింది.తరువాత ఉద్యమం పక్కదారి పట్టడంతో శ్రీరెడ్డికి మీడియాతో పాటు ఇతర నటీమణుల నుంచి కూడా సహకారం కరువైంది.
దాంతో లైంగిక వేధింపులపై ఎవరూ గట్టిగా మాట్లాడేవారు లేకుండా పోయారు.అయితే అప్పుడప్పుడు కొంత మంది అందాల భామలు తమ జీవితంలో ఎదురవుతున్న కాస్టింగ్ కౌచ్ భాగోతాలపై నోరు విప్పుతున్నారు.
తమని పలానా దర్శకుడు అలా వేధించాడు.ఇలా వేధించాడు అని చెబుతున్నారు.
అయితే వారిని వేధించిన వారు ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.
తాజాగా తెలుగు హాట్ భామ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న విజయవాడ అమ్మాయి తేజస్వీ మదివాడకి హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నా, ఎలాంటి బోల్డ్ పాత్రలకి అయిన రెడీగా ఉన్న ఆమెకి అవకాశం ఇచ్చే దర్శకులు లేరు.
ఈ విషయంపై ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకులు, నిర్మాతల పక్కలో పడుకుంటా అంటే అవకాశాలు పుష్కలంగా వస్తాయి.నార్త్ అమ్మాయిలు అందరూ కమిట్మెంట్ కి రెడీ అయ్యి వస్తున్నారు.
అందుకే వారికి అవకాశాలు భాగుంతున్నాయి.తెలుగు, తమిళ అమ్మాయిలకి ఈ విషయం తెలుసు కాని అంత వేగంగా అలాంటి ఆలోచనలకి అలవాటు పడలేకపోతున్నారు.
కమిట్మెంట్ కి రెడీ అంటే అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు.టాలీవుడ్ లో ఇప్పటికి 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది.
తనని ఎంతో మంది నేరుగా పడకగదికి రమ్మని ఆహ్వానించారు.వాటికి నేను అంగీకరించకపోవడం వలనే అవకాశాలు రాలేదు అని బోల్డ్ లో ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి గరించి తేజస్వీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.