ఒకప్పుడు హీరోయిన్ లలో ఉండే సైలెంట్ ఫీచర్ ఇప్పుడు హీరోయిన్ లలో మచ్చుక్కి కూడా కనపడ్డం లేదు.కుర్ర హీరోయిన్ లు సినిమాలు ఎంచుకునే విషయం దగ్గర నుంచీ మీడియా తో మాట్లాడే విషయం వరకూ అన్ని చోట్లా ముక్కు సూటిగా అవసరం అయితే చాలా గట్టిగానే వ్యవహరిస్తున్నారు.
ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడిగితే సైలెంట్ గా నవ్వుతూ సమాధానం చెప్పే పరిమితిని వారు ఎప్పుడో దాటేసారు.తెలుగు అమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్ గా వస్తున్న ‘ రోజులు మారాయి ‘ సినిమా ఈ వారాంతం లో అంటే ఎల్లుండి విడుదల కి సిద్దం అవుతూ ఉండగా ఈ సినిమా గురించి విలేఖర్లులు అడిగిన కొన్ని ప్రశ్నలలో పుకార్లకీ సంబంధించిన ప్రశ్నలు ఉండగా ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘ఐస్ క్రీమ్’ టైమ్ లో ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది తేజస్వి.‘అప్పట్లో నేను ఐస్ క్రీమ్ కి ప్రమోషన్స్ చేస్తున్నాను.వర్మ తన అందరి హీరోయిన్స్ లాగానే నాపై కూడా కొంచెం ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు.
దీన్ని అపార్ధం చేసుకున్న కొందరు మీడియా జనాలు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగారు’ అన్న తేజస్వి.
ఆ ప్రశ్నలు తానిచ్చిన జవాబు ఏంటో కూడా చెప్పింది.ఏకంగా రాం గోపాల్ వర్మ తో అఫైర్ ఉందా అని అడిగిన ప్రశ్నకి ఆయనతో నేను పడుకుంటే ఫస్ట్ మీకే చెప్తాను అంటూ సీరియస్ ఆన్సర్ ఇచ్చింది.