చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు తేజ సజ్జా. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి జాంబీ రెడ్డి సినిమాతో తేజ సజ్జా హీరో అయిపోయాడు.
ఇక ప్రియా ప్రకాష్ తో కలిసి నటించిన ఇష్క్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇవి కాకుండా హీరోగా మరో రెండు సినిమాలు అతని చేతిలో ఉన్నాయి.
హీరోగా ఎదగడానికి కావాల్సినంత స్కోప్ తేజ సజ్జాకి ఉంది.అలాగే పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా ఇతనికి సపోర్ట్ దొరుకుతుంది.
ఇప్పుడు ఏకంగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ కొత్త సినిమాకి తేజ సజ్జా సైన్ చేసాడని తెలుస్తుంది.స్వప్న దత్ ఈ సినిమాని నిర్మించనుందని సమాచారం.
ఇప్పటికే తేజ సజ్జాతో తమ బ్యానర్ లో చేయబోయే సినిమాకి కథ కూడా సిద్ధం అయ్యింది.
ఓ ఇంటరెస్టింగ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు బోగట్టా.
ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది.వైజయంతీ బాద్యతలు స్వప్న దత్ తీసుకున్న తర్వాత వరుస హిట్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు.జాతిరత్నాలు ఫేం అనుదీప్ తో ఒక సినిమా చేయనున్నారు.
అలాగే నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో పాన్ ఇండియా మూవీ రెడీ అవుతుంది.ఇప్పుడు తేజ సజ్జా హీరోగా కొత్త ప్రాజెక్ట్ ని త్వరలో ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తేజ సజ్జా రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ తో కలిసి వెన్నెల అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతుంది.
అలాగే జాంబీ రెడ్డి సీక్వెల్ లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.