తేజ సజ్జ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రూపొందిన అద్బుతం సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయ్యింది.సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని భావించినా కూడా పలు కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేక పోయినట్లుగా మేకర్స్ ప్రకటించి చివరకు ఓటీటీ లో విడుదల చేశారు.
సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించాడు.ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విభిన్న చిత్రాల దర్శకుడిగా ఈయనకు మంచి పేరు లభించింది.ఇప్పుడు ఆయన ఈ సినిమాకు కథను అందించాడు.
కొరియన్ మూవీ నుండి ఇన్సిపిరేషన్ గా ఈ సినిమా విడుదల తెరకెక్కింది.మంచి కాన్సెప్ట్ అవ్వడంతో హాట్ స్టార్ వారు భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది.
తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వడం.మంచి రెస్పాన్స్ రావడంతో హాట్ స్టార్ లో పెద్ద ఎత్తున సినిమాను చూస్తున్నారు.హాట్ స్టార్ లో కేవలం మూడు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ ను ఈ సినిమా దక్కించుకుంది.కేవలం స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి అరుదైన రికార్డు సాధ్యం అవుతుంది.
అతి తక్కవు సమయంలో వంద మిలియన్ మినిట్స్ వ్యూస్ ను దక్కించుకున్నందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ కు తోడు సినిమా పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.ఆయన ట్వీట్ తో సినిమా మరో వంద మిలియన్ మినిట్స్ వ్యూస్ ను కూడా అతి త్వరలోనే పూర్తి చేసుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్ లు మంచి నటనతో ఆకట్టుకున్నారు.
అందుకే సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ దక్కిందని అంటున్నారు.