నందమూరి అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నందమూరి తారకరామారావు బయోపిక్ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి.ఎన్టీఆర్ చిత్రానికి ఎంతో మంది దర్శకులను పరిశీలించి చివరకు తేజకు ఆ బాధ్యతలను బాలయ్య అప్పగించడం జరిగింది.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి పొలిటికల్ డ్రామాను ప్రేక్షకుల ముందు ఉంచిన దర్శకుడు తేజ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకు న్యాయం చేస్తాడని బాలకృష్ణ భావించాడు.తేజ కూడా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ఇతర ప్రాజెక్ట్లను కూడా పక్కకు పెట్టాడు.
ఇటీవలే సినిమా ప్రారంభోత్సవం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరిగిన విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ తేజ ఆ వేదిక మీద ప్రకటించాడు.దాంతో అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో దర్శకుడు తేజ సంచలనాత్మకంగా తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం అని, ఆయన చరిత్రను తాను చూపించేంత సమర్ధుడిని కాదు అంటూ చేతులు ఎత్తేశాడు.దాంతో ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కెరీర్ ఆరంభం నుండి కూడా తేజ దేనికి అంత సులభంగా ఓకే అవ్వడు అనే టాక్ ఉంది.స్క్రిప్ట్ విషయంలో మరే విషయంలో అయినా కూడా తన మాట చెలామని అవ్వాలని కోరుకుంటాడు.
అన్ని సినిమాలకు మాదిరిగానే ఈ చిత్రంకు కూడా స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా తన మాట నెగ్గాలని తేజ భావించాడు.అయితే స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా తాను చెప్పినట్లుగా జరగాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నాడు.
తన తండ్రి జీవిత చరిత్రను అంతా పాజిటివ్గానే చూపించాలనేది బాలకృష్ణ అభిప్రాయం.కాని తేజ మాత్రం కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి.
వాటిని సున్నితంగా చూపించాలని భావించాడు.అందుకు బాలయ్య నో చెప్పడం వల్లే తేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ సినిమా దర్శకత్వంలో వేలు పెట్టడు.కాని తన తండ్రి చిత్రం అవ్వడం వల్లే స్క్రిప్ట్ మరియు సీన్స్ తాను అనుకున్నట్లుగా తీయాలని సూచించడం వల్లే ఈ అనిశ్చితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు.
తేజ తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు రాబోతున్నారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.తేజ ఈ చిత్రం నుండి ఎప్పుడో తప్పుకున్నాడు.అయితే తాజాగా ఆ విషయం అధికారికంగా వెళ్లడి అయ్యింది.గత కొన్నాళ్లుగా ఈ చిత్రం కోసం దర్శకుడిని వెదికే పనిలోనే బాలయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.
క్రిష్, వినాయక్, వైవిఎస్ చౌదరిలు బాలయ్య పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.