టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తేజ అప్పట్లో వరుస బ్లాక్బస్టర్లు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వారిని హీరోలుగా మలిచాడు.
అయితే కొంతకాలం వరుస ఫెయిల్యూర్లతో ట్రాక్ తప్పిన ఈ డైరెక్టర్ ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ సక్సె్స్ ట్రాక్లోకి వచ్చాడు.
కాగా ఇటీవల సీత అనే చిత్రంతో మరోసారి ఫెయిల్యూర్ను ఎదుర్కొన్న తేజ, ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలను లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
దీనికి సంబంధించి రెండు టైటిళ్లను తేజ తన పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశాడు.రానా దగ్గుబాటితో తేజ తీయబోయే సినిమాకు రాక్షస రాజు రవణాసరుడు అనే టైటిల్ను ఫిక్స్ చేశాడు.
ఇక మరో హీరో గోపీచంద్తో తీయబోయే సినిమాకు అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
రెండు ఇంట్రెస్టింగ్ టైటిళ్లను తేజ రివీల్ చేయడంతో ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.
ఇక ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తేజ రెడ అవుతున్నాడు.ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలపడానికి తేజ రెడీ అవుతున్నాడట.