అక్కినేని ఫ్యాన్స్ ఆశాకిరణంగా తెరంగేట్రం చేసిన అఖిల్ సినిమా సినిమాకు ఫ్యాన్స్ అభిమానం కోల్పోతున్నాడు.అఖిల్ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో తన స్టార్డంను తగ్గించుకున్నాడు.ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సమ్మర్లో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడినది.
ఇక అఖిల్ తదుపరి చిత్రం విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అసలు ఈయన తదుపరి చిత్రంను ఎవరితో చేస్తాడు అనేది తెలియడం లేదు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది.ఆ తర్వాత అఖిల్ తర్వాత సినిమాను ప్రకటిస్తాడు అంటే మాత్రం ఖచ్చితంగా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.ఆ సినిమా విడుదల జాప్యం అవుతున్న నేపథ్యంలో కొత్త సినిమాను అఖిల్ కమిట్ అయ్యి చేయడం ఉత్తమం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్ కూడా అఖిల్ ఆలస్యం చేయవద్దంటూ సూచిస్తున్నారు.
ఇప్పటికే అఖిల్ సినిమా కోసం కథలు విన్నాడు.
వారం రోజుల క్రితం అఖిల్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక అంతకు ముందు ఇప్పుడు కూడా అఖిల్ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు.
అఖిల్తో ఏకంగా 40 కోట్ల బడ్జెట్తో సినిమాను తీసేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దాంతో అఖిల్ మూవీ మొదట ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే స్పష్టత కరువయ్యింది.
అఖిల్ కొత్త సినిమా విషయంలో స్పష్టత రావాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.