ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న.ఒక జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకప్పుడు కేసీఆర్ పట్ల సానుకూలతగా ఉన్న మల్లన్న రానురాను కేసీఆర్ తో విభేదిస్తూ, కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తూ, ఒక సొంత మీడియా ఛానల్ ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజలను, కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్న యువతను, ఉద్యమకారులను తన వైపు తిప్పుకున్నాడు.
ఒకప్పుడు సాధారణ జర్నలిస్ట్ మల్లన్న ఇప్పుడు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు.అయితే ఇక స్వతహాగా రాజకీయాలపై మక్కువ ఉన్న మల్లన్న నాగార్జున సాగర్ నుండి పోటీ చేసాడు.
కాని ఎన్నికల్లో గెలవలేకపోయాడు.అయితే తరువాత తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా మల్లన్న రోజురోజుకు యువతలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఎంతలా అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో 30వేలకు పైగా ఓట్లను సంపాదించుకొని కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడిస్తాడా అన్న విధంగా తన ఓటు షేరింగ్ ఉందంటే ఇక మల్లన్న స్థాయి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు.ఏది ఏమైనా భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతానడంలో ఎటువంటి సందేహం లేదు.
కాని కులం, మతం రాజ్యమేలుతున్న పరిస్థితులలో మల్లన్న ఈ తరహా రాజకీయాలలో విజయం సాధించగలడా అనేది చూడాల్సి ఉంది.