హైదరాబాద్ లో ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం వలన ఇప్పుడు ఓ యువతి ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.పెళ్లి కాని యువతులకి డబ్బులు ఆశ చూపించి వారి మీద క్లీనికల్ ట్రైల్స్ చేసి వారి నుంచి ఆండాలని సేకరించి చట్ట విరుద్ధంగా అమ్ముకుంటారు.
అయితే ఒక్కో సారి ఇలాంటి క్లీనికల్ ట్రైల్స్ ఫెయిల్ అవుతూ వుంటాయి.ఇప్పుడు అలాంటి పరిస్థితి ఓ యువతి విషయంలో జరిగింది.
కామారెడ్డికి చెదిన విజయలక్ష్మి అనే యువతీ ఓ ప్రైవేట్ కంపనిలో పని చేస్తుంది.ఓ వ్యక్తి ఆమెకి డబ్బులు ఆశ చూపించి క్లీనికల్ ట్రయిల్ కి ఒప్పించారు.
దీంతో ఆమె ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్లి క్లీనికల్ ట్రైల్స్ చేయించుకుంది.దాని కోసం ఆమెకి దళారులు ఇరవై వేల రూపాయిలు ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే క్లీనికల్ ట్రయిల్ చేయించుకున్న కొన్ని రోజులకి ఆమె అనారోగ్యంకి గురి కావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ లో చేర్పించారు.దీంతో ఆమె గర్భవతి అయినట్లు డాక్టర్స్ గుర్తించారు.
అయితే ఇదంతా క్లీనికల్ ట్రయిల్ వలన జరిగినట్లు సమాచారం.ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది.