ఈ మధ్య కాలంలో మ్యాట్రిమొనీ సైట్స్ ద్వారా వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.అయితే ఇలాంటి వివాహ సంబంధాల కారణంగా మోసపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
వీటి ద్వారా చూసుకునే సంబంధాలలో ఒకరి గురించి ఒకరికి, ఒకరి కుటుంబం గురించి మరొకరికి తెలియకపోవడం వలన వివాహం తర్వాత చాలా మంది దెబ్బలు తింటున్నారు.కొంత మందిపెళ్లి సిద్ధపడి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక మోసపోతున్నారు.
ఇప్పుడు అలాంటి ఘటన బెంగుళూరు లో జరిగింది.పెళ్లి నిశ్చితార్ధం అంతా చేసుకొని పెళ్ళికి రెడీ అయిన తర్వాత నీ ముక్కు భాగోలేదు అని సంబంధం లేని రీజన్ చెప్పిన ఓ యువతీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.
బెంగళూరు టెకీ జ్యోతిప్రకాష్కు ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా హిమబిందు అనే యువతి పరిచయమైంది.ఇద్దరి ఆలోచనలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.సెప్టెంబర్ 9న వీరి నిశ్చితార్థం చేసుకున్నారు.ఇక యువతి కోరిక ప్రకారం ఇరు కుటుంబ పెద్దలూ జనవరి 30న వీరికి తిరుమలలో వివాహం చేయాలని నిశ్చయించారు.
ఆ తరువాత యువకుడి తరఫున బంధువులు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారు.పెళ్లి కోసం తిరుమలలో 70 రూములు బుక్ చేశారు.
నాలుగ లక్షల రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొన్నారు.ఇంతలో పెళ్లి కూతురు తనకి పెళ్లి ఇష్టం లేదని ఆమె జ్యోతి ప్రకాష్ కి ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకుంది.
పెళ్లి వద్దనడానికి కారణం ఎంతని అడిగితే జ్యోతి ప్రకాష్ కి పెద్ద ముక్కు ఉండటమే కారణం అని చెప్పి తప్పిందుకుంది.దీంతో మోసపోయామని గ్రహించి పెళ్లి కొడుకు పోలీసులని ఆశ్రయించాడు.