టీమిండియా మహిళా జట్టు దూసుకుపోతోంది.జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లు తమ ప్రతిభకు పదును పెడుతున్నారు.
రికార్డులు బద్దలు కొడుతున్నారు.అయితే తాజాగా ఓ మ్యాచ్ లో క్రికెటర్ కు వింత అనుభవం ఎదురైంది.
టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మకు ఆమె వయస్సు విషయంలో వింత అనుభవం ఎదురైంది.టీమిండియా మహిళా టీమ్ ఆదివారం రోజు ఇంగ్లండ్ మహిళల జట్టుతో తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ ఆడింది.
ఆ మ్యాచ్ తో షఫాలీ వర్మ అరంగేట్రం చేసింది.టీమిండియా తరపున వన్డే క్రికెట్లో 131వ వుమెన్ క్రికెటర్ గా బరిలోకి దిగింది.17 ఏళ్ల ప్రాయంలోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో స్థానం సంపాదించి రికార్డు నెలకొల్పింది.ఆదివారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా వుమెన్స్ టీమ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
మ్యాచ్ లో ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందనలు క్రీజులో నిలబడ్డారు.మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ టెన్ చానెల్ నిర్వహకులు క్రికెటర్ షఫాలీ స్టాట్స్ ను తప్పుగా చూపెట్టి నవ్వుల పాలయ్యారు.
షఫాలీ ఏజ్ 17 ఏళ్లు మాత్రమే.
అయితే ఆమెకు 28 ఏళ్ల వయసు ఉన్నట్లుగా టీవీలో డిస్ప్లే అవ్వడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు.
చానెల్ నిర్వాహకులను సోషల్ మీడియాలో ఉతికి పారేశారు.షఫాలీ వయస్సు చూస్తే 17 మాత్రమే.అయితే ఆమె వయసు 28గా డిస్ ప్లేలో చూపించారు.ఏం తాగి వచ్చారా అరంగేట్రం మ్యాచ్ లోనే షఫాలీ వయస్సును ఇలా చూపిస్తారా.అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆమెకు ఏజ్ ను తప్పుగా చూపించినట్లైతే ఏమవుతుందో పాపము అని చానెల్ నిర్వాహకులను నిద్రపోతూ పనిచేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం షఫాలీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా అవుతున్నాయి.అయితే షఫాలీ వర్మ టీ20 ల్లో దూకుడును ప్రదర్శిస్తారు.
అదే ఆటతీరు కనబరుస్తూ కొంత కాలంలోనే పేరు తెచ్చుకుంది.దూకుడుగా ఆడి
సెహ్వాగ్ లాగా
పరుగులు చేసింది.
షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేయగా ఇందులో మూడు అర్థసెంచరీలు చేసి రికార్డు నెలకొల్పింది.