దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్ 19 మహిళల ప్రపంచ కప్ టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మహిళల టీం బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.ఈ క్రమంలో భారత్ బౌలర్ ల దాటికి ఇంగ్లాండ్ 68 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.
భారత బౌలర్ లలో తితాస్ సాధు 2, అర్చనా దేవి 2, పర్శవి చోప్రా 2, మన్నత్ కశ్యప్ 1, కెప్టెన్ షెఫాలీ వర్మ 1, సోనమ్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ నీ దెబ్బతీయడం జరిగింది.ఆ తర్వాత రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్…14 ఓవర్ లలోనే టార్గెట్ చేదించడం జరిగింది.
షఫాలీ వర్మ (15), శ్వేతా సేహవ్రత్ (5) త్వరగా ఔట్ అయిపోగా తర్వాత.సౌమ్య తివారి(24)… తెలుగు అమ్మాయి త్రిష(24).
పరుగులు చేసి భారత్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.