న్యూజిలాండ్ పై మొదటి టీ20 మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా.ఈరోజు జరిగిన రెండో టి20 మ్యాచ్ గెలవడం జరిగింది.
దీంతో సీరీస్ 1-1తో సమం అయింది.మూడో టి20 మ్యాచ్ ఫిబ్రవరి మొదటి తారీకు అహ్మదాబాద్ లో జరగనుంది.
టాస్ ఓడిపోయిన భారత్ బౌలింగ్ చేయడం జరిగింది.దీంతో మొదటి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్ లకి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది.
భారత్ బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లు 6 ఫోర్ లు మాత్రమే కొట్టారు.
భారత్ బౌలర్ లలో అర్షదీప్ రెండు వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ ఒకో వికెట్ పడగొట్టారు.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్.99 వరుగుల అతి తక్కువ లక్ష్యాన్ని చేదించడానికి చివరి ఓవర్ దాకా శ్రమ పడటం జరిగింది.19.5 ఓవర్ లలో 100 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో చేదించారు.దీంతో సీరిస్ 1-1తో సమం అయింది.
ఇక కీలకమైన మూడో టి20 మ్యాచ్ ఫిబ్రవరి మొదటి తారీకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.