హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియం లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు సత్తా చాటారు.టాస్ గెలిచి ముందుగా బాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో కేవలం 236 పరుగులు మాత్రమె చేయగలిగింది.
ఓపెనర్ ఫించ్ డకౌట్ కాగా మరో ఓపెనర్ ఉస్మాన్ క్వాజా అర్ధసెంచరీతో రాణించారు, అలాగే మాక్స్ వెల్ 40 పరుగులు చేసి చివర్లో స్కోర్ పెంచే ప్రయత్నం చేసారు.
ఇదిలా వుంటే ఇక భారత్ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.
ఇక భారత బౌలర్లు షమీ, బూమ్రా, కుల్దీప్, తలో రెండు వికెట్స్ తీసారు.కేదార్ జాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.భారత్ ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి రెడీ అవుతుంది.
.