ఐసీసీ వరల్డ్కప్ కు టీమిండియా సన్నద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత జట్టు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లింది.
ఈ నెల 30 న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్ని ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కి ముందు మే 25 న న్యూజిలాండ్ తో తోలి వార్మప్ మ్యాచ్ లో భారత్ తలపడనుంది.
అలానే మే 28 న బాంగ్లాదేశ్ తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్ళింది.విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ జట్టు జూన్ 5న సౌతంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది.
ఈ క్రమంలో 15 మంది సభ్యుల బృందంతో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, జట్టు సహాయ సిబ్బంది ఇంగ్లాండ్ వెళ్లారు.
ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ ప్రత్యేక డ్రెస్కోడ్లో మెరిసిపోయారు.
విమానం ఎక్కేందుకు ముందు వీరంతా కూడా సరదా గా ఆన్ లైన్ గేమ్స్ ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.