ప్రపంచ కప్ కు సన్నద్ధమైన టీమిండియా...ఇంగ్లాండ్ వెళ్ళింది

ఐసీసీ వరల్డ్‌కప్‌ కు టీమిండియా సన్నద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంగ్లాండ్‌ బయలుదేరి వెళ్లింది.

 Team India Ready To Play World Cup-TeluguStop.com

ఈ నెల 30 న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్ని ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కి ముందు మే 25 న న్యూజిలాండ్ తో తోలి వార్మప్ మ్యాచ్ లో భారత్ తలపడనుంది.

అలానే మే 28 న బాంగ్లాదేశ్ తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్ళింది.విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ జట్టు జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది.

ఈ క్రమంలో 15 మంది సభ్యుల బృందంతో పాటు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, జట్టు సహాయ సిబ్బంది ఇంగ్లాండ్‌ వెళ్లారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ ప్రత్యేక డ్రెస్‌కోడ్‌లో మెరిసిపోయారు.

విమానం ఎక్కేందుకు ముందు వీరంతా కూడా సరదా గా ఆన్ లైన్ గేమ్స్ ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube