ఈ ఏడాది జరగనున్న అతిపొట్టి క్రికెట్ ఫార్మాట్ టీ20 ప్రపంచకప్ను దక్కించుకునే అవకాశం టీమిండియాకు పుష్కలంగా ఉన్నాయని వెస్టిండీస్ లెజెండరీ ఆటగాడు బ్రయాన్ లారా అన్నారు.ఐసీసీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో వ్యక్తిగత 400 పరుగులు చేసిన మగధీరుడిగా బ్రయాన్ లారా పేరొందాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ జట్లలో భారత జట్టు చాలా పటిష్టంగా ఉందని, భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో ఎలాంటి మ్యాచుల్లోనైనా దూకుడును ప్రదర్శిస్తుందని లారా చెప్పుకొచ్చాడు.ఇక అతిచిన్న ఫార్మాట్ టీ20లో పరుగుల వర్షం కురియడంలో ఎలాంటి సందేహం లేదని, టీమిండియా ఈ టోర్నమెంట్లో హాట్ ఫెవరెట్ అని ఆయన కొనియాడారు.
భారత జట్టు ప్రస్తుతం ఉన్న ఫాంలో టీ20ని గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన జ్యోత్సం పలికారు.కాగా బ్రయాన్ లారా పేరిట ఉన్న 400 వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటివరకు ఏ ఒక్క ఆటగాడు టచ్ చేయకపోవడం విశేషం.