పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ యావత్తు పాకిస్తాన్ దురాగతాన్ని, టెర్రరిస్ట్ ఎతాక్స్ ని ఖండించాయి.ఇక భారత ప్రభుత్వం పాకిస్తాన్ పెంచి ప్శిస్తున్న టెర్రరిజంకి ఫుల్ స్టాప్ పెట్టె విధంగా ప్రపంచ వేదికల నుంచి ఒత్తిడి తీసుకొస్తుంది.
మరో వైపు తమకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకొని పాకిస్తాన్ ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా వుంటే ఏప్రిల్ లో ఇంగ్లాండ్ వేదికగా క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది.
ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా, పాకిస్తాన్ తో తలపడనుంది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
అయితే క్రికెట్ మాజీలు పాకిస్తాన్ తో క్రికట్ ఆడి గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు.దీంతో ఈ మ్యాచ్ పై అనుమానాలు మొదలయ్యాయి.
ఇదిలా వుంటే పాకిస్తాన్ తో టీం ఇండియా క్రికెట్ ఆడే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తూ వున్నా బీసిసిఐ, ఇప్పటికే ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ని నిషేధించాలని ఐసిసి ని కోరింది.ఆయితే ఇప్పుడు ఊహించని విధంగా ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడం ద్వారా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రపంచ కప్ లో టీం ఇండియా ఆడకపోతే భారీ నిరాహకులకి భారీ నష్టాలు వస్తాయి.ఈ నేపధ్యంలో పాకిస్తాన్ ని ప్రపంచ కప్ నుంచి నిషేధించడానికి మిగిలిన దేశాలు నిర్ణయం తప్పనిసరి.
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో క్రికెట్ ప్రపంచ కప్ లో కూడా పాకిస్తాన్ ని వంటరి చేయడం ద్వారా ఆ దేశంపై తమ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.