టీమిండియా ఫ్యాన్స్ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కోహ్లీసేన ఘోరపరాభవం పాలయింది.భారత్ కనీస పోటీని కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఫ్యాన్స్ అనేక కోణాల్లో విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా కోహ్లీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ విరుచుకుపడుతున్నారు.తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ ఆర్డర్ 10 ఓవర్లలోనే కుప్పకూలింది.
ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సిక్సులు, ఫోర్లతో చెలరేగుతూ తమపై యావద్భారత్ పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలనుకున్నారు.మంచి భాగస్వామ్యంతో ఇండియా స్కోర్ ను పరుగులు పెట్టించారు.
రిషబ్ పంత్ రెండుసార్లు ఒంటిచేత్తో సిక్సర్లు బాది స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు.
కానీ వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత దిగిన ఆటగాళ్లు చాలా పేలవమైన ఆట ప్రదర్శన కనబరిచారు.ఈ సమయంలో ‘అంతా మీరే చేశారంటూ.’ నెటిజన్లు కోహ్లిని విమర్శించడం ప్రారంభించారు.మంచి జోరు మీద ఉన్న ఇషాన్ కిషన్ను ఎందుకు తీసుకోలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడని.అతన్ని పక్కనపెట్టేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ట్విట్టర్లో భారీ ఎత్తున విరుచుకుపడ్డారు.హార్ధిక్ పాండ్యా ఫామ్లో లేడని.
అసలు అతని ఫిట్నెస్యే బాగోలేదని కూడా నెటిజన్లు ప్రస్తావించారు.పాక్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా బౌలింగ్ కూడా వేయలేదు సరికదా బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు.
అందుకే అతడిని అనవసరంగా ఎంపిక చేసుకున్నారని.ఒకవేళ ఇషాన్ కిషన్కు చోటు ఇచ్చినట్లయితే ఇండియా గెలిచేదేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఇషాన్ కిషన్ ఐపీఎల్తో సహా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సిక్సులు, ఫోర్లు కొడుతూ తన విశ్వరూపం చూపించాడు.ఐపీఎల్లో 16 బాల్స్ లో హాఫ్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ పాక్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియాకి కచ్చితంగా వెన్నెముకగా నిలిచేవాడిని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏదేమైనప్పటికీ, పాకిస్థాన్ జట్టు చాలా కసిగా ఆడి.గతంలో ఓడిపోయిన అన్ని ఓటములకు గట్టి బదులిచ్చింది.ముఖ్యంగా ఓపెనర్లుగా దిగిన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ అణువంతైనా ఒత్తిడికి తలొగ్గకుండా సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ని గెలిపించారు.