దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజలే కాకుండా రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ టీకాను వేసుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడే కరోనా వ్యాక్సిన్ అంటే ఉన్న భయం తగ్గిపోతున్న కారణంగా వీరంతా టీకా కోసం ముందుకు వస్తున్నారు.ఇకపోతే నిన్న చాలా మంది ముఖ్యనేతలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ రోజు ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా కరోనా టీకా వేయించుకున్నారు.తన మొదటి డోస్ను మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో తీసుకున్నారు.
ఇక ఈ విషయాన్ని స్వయంగా రవిశాస్త్రి ట్విట్టర్ ద్వార తెలియ పరిచారట.ఇకపోతే కరోనా వల్ల జరిగిన నష్టాన్ని గుర్తుచేస్తూ, ఈ మహమ్మారి పోరులో వైద్యులు, శాస్త్రవేత్తల ఘనతను కొనియాడారు.
వారి కృషికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం కరోనా టీకాలో భారత్ ముందంజలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.