న్యూజిలాండ్తో హోరాహోరీగా జరిగిన టీ20 టీమ్ సిరీస్ లో టీమ్ ఇండియా అరుదైన రికార్డు సాధించింది.న్యూజిలాండ్పై విజయం సాధించడంతో భారత క్రికెట్ జట్టు మరోసారి అరుదైన రికార్డులను బద్దలుకొట్టింది.
వరుసగా ఎనిమిదోసారి టీ20 సిరీసును కైవసం చేసుకున్న జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది.అంతేకాకుండా మూడు మ్యాచ్ ల టీ20 సిరీసులను అధిక సార్లు వైట్వాష్ చేసింది.
ఆరు సిరీసులు గెలిచిన పాకిస్థాన్తో ఇప్పుడు ఇండియా సమానం అయింది.
న్యూజీలాండ్ జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా తన సత్తా ఏంటో చూపించింది.
టాస్ గెలిచినా ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది.రోహిత్ శర్మ (56), వెంకటేశ్ అయ్యర్ (20), దీపక్ చాహర్ (21), ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (25)దుమ్ములేపేసారు.
అలాగే తమ ప్రత్యర్థులకు 185 పరుగుల లక్ష్యన్ని వారి ముందు ఉంచారు.బౌలింగ్లో అక్షర్ పటేల్ 3, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 17.2 ఓవర్లకు 111 పరుగులకే ఆలౌట్ చేశారు.మార్టిన్ గప్తిల్ ఒక్కడే 51 పరుగులు చేశాడు.
మరి ఎక్కువ వైట్వాష్లు చేసింది దేశాలు ఏంటంటే భారత్ – 6, అఫ్గానిస్థాన్ – 5, పాకిస్థాన్ – 6, దక్షిణాఫ్రికా – 3, ఇంగ్లాండ్ – 4 భారత్ చేతిలో వైట్వాష్కు గురైన జట్లు ఏంటంటే 3-0 vs ఆస్ట్రేలియా 2016 వ సంవత్సరంలో,(A), 3-0 vs శ్రీలంక 2017 లో (H), 3-0 vs వెస్టిండీస్ 2019 లో (A), 5-0 vs న్యూజిలాండ్ 2020 లో (A), 3-0 vs వెస్టిండీస్ 2018 లో (H), 3-0 vs న్యూజిలాండ్ 2021 (H)లో వైట్ వాష్ చేసి భారత్ రికార్డ్ సృషించింది.