మరణం అనేది నేటికాలంలో కామన్గా మారిపోయింది.ఇక మరణించిన వారి కోసం ఆలోచనలు కూడా ఎక్కువగా చేయడం లేదు నేటి కాలంలో.
ముఖ్యంగా కరోనా చావులకు కేరాఫ్ అడ్రాస్గా మారి పోయింది.అయితే ఒక కరోనానే కాదు మిగతా అనారోగ్య సమస్యల వల్ల కూడా మరణిస్తున్న వారు లెక్కలోకే రావడం లేదు.
ఇకపోతే టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.గతేడాది సెప్టెంబరు నుండి కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) మీరట్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
ఇకపోతే కిరణ్ పాల్ సింగ్ కు క్యాన్సర్ అని తెలియగానే ఇతని కుటుంబ సభ్యులు బ్రిటన్ లో వైద్య నిపుణులను సంప్రదించారట.వారి సలహాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో పొందుతున్న చికిత్సలో భాగంగా కీమోథెరపీ అందుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఆయన ఆరోగ్యం రెండు వారాలుగా క్షీణిస్తూ తుదకు మరణాన్ని దరికి చేర్చింది.ఇక భువనేశ్వర్ తండ్రి మరనం పట్ల పలువురు టీమిండియా సహచరులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.