కులగజ్జి తో ఒక ప్రాణం పోయింది

ఒక వైపు ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు తీస్తుంటే మరో వైపు కులజాడ్యం కూడా వేగంగా వేళ్ళునుకుంటోంది.ఇది సాధారణ ప్రజలపైనే గాక బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్న వారిని కూడా వదలడం లేదు.

 Teachers Killed A Boy With The Cast Feeling-TeluguStop.com

ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది.ఈ కుల పిచ్చి మధ్యప్రదేశ్ లోని దామోహ్ లో ఒక బాలుడి ప్రాణం తీసింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు.అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు.

నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

గురువులే ఇలాంటి పని చేయడంపై మానవ హక్కుల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube