టెక్నాలజీలో వేగం పెరిగింది.అలాగే లోకంలో మనుషులు కూడా అప్డేట్ అయ్యారు.
అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ప్రతిది శోధిస్తున్నాడు.దీని వల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా అనుభవిస్తున్నాడు.
ఇక సెల్ ఫోన్లో డాక్టర్ సలహాలు పాటిస్తూ డెలివరి చేయడం సినిమాల్లో మాత్రమే సాధ్యం.కానీ నిజజీవితంలో కూడా ఇది సాధ్యపడింది.
అలాగని ఇలా ప్రయత్నం మాత్రం ఎవరు చేయకండని మనవి.
ఇక అసలు విషయానికి వస్తే.
కర్నాటకలో కొడగులోని గోనికోప్పల్ సమీపంలో ఉన్న ఒక గిరిజన గ్రామానికి చెందిన మల్లిగే అనే 9నెలల గర్భిణి ట్రీట్మెంకోసం తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చిందట.ఈ క్రమంలో సోమ్ వార్ పేట మండలం ఆఫీస్ ఎదురు రాగానే డెలివరీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి.
వెంటనే పక్కనే ఉన్న పబ్లిక్ పార్క్ లోపలికి వెళ్ళిన మహిళ, ఆ నొప్పిని భరించలేక, సాయం చేయాలంటూ కేకలు వేస్తుండగా, ఆ సమయంలో స్కూల్ కు వెళుతున్న పీఈటీ టీచర్ శోభా ప్రకాష్ పార్క్ లోకి వెళ్లి చూడగా, పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళ కనిపించిందట.
వెంటనే ఆమెకు సాయం చేయాలని స్థానికుల్ని కోరగా, ఒకవ్యక్తి ముందుకు వచ్చి డాక్టర్ అయిన తన ఫ్రెండ్కు కాల్ చేసి ఆ టీచర్కు ఇచ్చాడట.
కాగా డాక్టర్ ఫోన్లో డెలివరీ ఎలా చేయాలో చెబుతుంటే ఆ టీచర్ మహిళకు డెలివరీ చేసింది.ఆ టీచర్ చేసిన డెలివరి విజయంతం అవగా ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం 108 సిబ్బంది వచ్చి తల్లిని బిడ్డను చెలువంబా ఆసుపత్రికి తరలించారట.ఇక ఆ భవంతుని దయ వల్ల మంచి జరిగింది కానీ ఏదైన వికటిస్తే మాత్రం పరిస్దితి వేరేలా ఉండేది.