కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు విద్యార్థుల పాఠశాలను మూసివేశారు.
అకాడమిక్ ఇయర్ దెబ్బతినడంతో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది.కొన్ని పాఠశాలలు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో తరగతులు చెబుతున్నారు.
ఏం చేసుకుంటారనే అహంకారంతో కొందరు పాఠాలు చెప్పే గురువులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఉపాధ్యాయులపై సెటేర్లు, జోకులు వేస్తూ వారిని వేధిస్తున్నారు.
తాజాగా 55 ఏళ్ల ఉపాధ్యాయుడిని కన్నీరు పెట్టుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెడ్ ది స్టోనర్ అనే అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ అకౌంట్ లో ఉపాధ్యాయులు విద్యార్థులను బోధించేటప్పుడు వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు బోధించే సమయంలో ఎంత ఒత్తిడి పెరుగుతుందో అందరికి తెలిసేలా చేయడానికి ఈ అకౌంట్ ను క్రియేట్ చేసి పోస్ట్ చేయబడింది.
ఫోటో షేర్ చేసి క్యాప్షన్ కింద షేర్ చేయండి.చదవండి.అర్థం చేసుకోండి.ట్రోలింగ్ బుల్లింగ్ కు సమానం కాదు.
మీరు కూడా టీచింగ్ పై జోక్స్ చేయవచ్చు అంటూ ఫోటోను షేర్ చేశారు.
ఓ పాఠశాల ప్రిన్సిపల్ 55 ఏళ్ల ఉపాధ్యాయుడిని ఆన్ లైన్లో పాఠాలు చెప్పాలని, సిద్ధంగా ఉండాలని చెప్పడంతో తన కూతురి సాయంతో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసులు చెప్పడానికి రెడీ అయ్యాడు.
ఓ విద్యార్థి వేరే ఐడీతో బెదిరించడం ప్రారంభించాడు.కోపంతో ఇబ్బంది పడుతూనే అరిచాడు ఉపాధ్యాయుడు.టీచర్ కుమారై ఆ ఐడీ మ్యూట్ లో పెట్టినా అన్ మ్యూట్ చేస్తూ వేధించసాగాడు.క్లాసులు ముగిసే వరకు తప్పుగా పిలుస్తూనే ఉన్నాడు.
క్లాసులు ముగిశాక తన కుమారైను పిలిచి రోధించసాగాడు.తన జీవితంలో ఎప్పుడూ పడని బాధను తలుస్తూ రాత్రి నిద్రపోలేదు.
ఈ పోస్ట్ కు 3 లక్షల మంది లైక్ చేయగా, యూజర్లు అధిక సంఖ్యలో కామెంట్లు పెట్టారు.