ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదు అనే సందిగ్ధంలో ఉన్నారు.కొన్ని సంఘటనలు చూస్తే ఈ విషయాన్ని మనం ఒప్పుకోక మానదు.
విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను మంచి బాటలో నడిపించాల్సిన గురువే పైశాచికంగా విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఆమెర్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో స్థానికంగా ఉంటున్న ఓ యువతి కోచింగ్ తీసుకుంటోంది.అయితే ఇందులో ఉపాధ్యాయుడు ఆమెపై కన్నేశాడు.ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని రోజూ ఆమెను స్పెషల్ క్లాసులు పేరుతో తన ఇంటికి పిలిచేవాడు.
ఈ క్రమంలో ఆ యువతి ఉపాధ్యాయుని ప్రైవేటుగా కలిసేందుకు వెళ్ళింది.ఇదే అదునుగా తీసుకున్న ఆ ఉపాధ్యాయుడు యువతికి జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
ఆ జ్యూస్ లో మత్తు మందు కలిపిన విషయం తెలియక ఆ యువతి జ్యూస్ తాగి మెల్లగా మత్తు లోకి జారుకుంది.దీంతోఆ ఉపాధ్యాయుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి వీడియో కూడా తీశాడు.
అత్యాచారం అనంతరం సృహలోకి వచ్చింది.మెల్లగా తనపై జరిగిన అఘాయిత్యం తెలుసుకొని నిందితుడిని నిలదీసింది.దీంతో నిందితుడు ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తన అశ్లీల వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ తరచు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు.దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు
.