ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.జరిగిన ఎన్నికల్లో దాదాపు.
క్లీన్ స్వీప్ దిశగా.వైసీపీ విజయాలు సాధిస్తూ ఉంది.
ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా.వైసీపీ గెలిచిన సందర్భాలు ఇటీవల చూశాం.
ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సహజంగానే ఇటువంటి ఎన్నికలలో ఎప్పటిమాదిరిగానే అధికారపార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని వివరణ ఇచ్చారు.
అయినా గాని అధికార పార్టీ వైసీపీ భయబ్రాంతులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడి.
ధన బలంతో.విఱ్ఱవీగి.
ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులతో అనేక ఇబ్బందులు సృష్టించి గెలిచారని చెప్పుకొచ్చారు.కానీ ఇటీవల జరిగిన ఆకివీడు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరగడం సంతోషకరమని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత, గతం.లో ఉన్న ఏ ప్రభుత్వంపై లేదని… ఆ తరహాలో ప్రజా వ్యతిరేకత నెలకొంది అని పేర్కొన్నారు.ఇదే సమయంలో పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అదే రీతిలో.కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా గుర్తించి.పార్టీలో భవిష్యత్తు ఉండేలా.చూసుకుంటామని స్పష్టం చేశారు.
పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వారికే తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు.ఈ సమావేశంలో పేర్కొన్నారు.