వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్.. ??

ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారు ఎందరో ఉన్నారు.ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు కూడా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతుండగా, ఏపీ సీయం మాత్రం విశాఖ స్టీల్ ‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వనని హమీ ఇస్తున్నారు.

 Tdp Varla Ramaiah Comments On Viajayasai Reddy Yatra, Tdp Varla Ramaiah, Comment-TeluguStop.com

కాగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని కార్మిక సంఘాలు భీష్మించి కూర్చున్నాయి.

ఈ క్రమంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల సెగ ఢిల్లీని కూడా తాకింది.

ఈ విషయంలో కేంద్రంలో జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయట.ఇకపోతే విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభించడం తెలిసిందే.

ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించి, షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన సూత్రధారి, మార్గదర్శి, మధ్యవర్తి, పలు కేసుల్లో నిందితుడు, ఏది అసాధ్యమో తెలిసినా, సాధ్యమేనంటూ ప్రజలను ఇంత కాలం మభ్యపెడుతన్న వ్యక్తి ఏం తెలియనట్టుగా పాదయాత్ర చేస్తున్నాడని ఆరోపించారు.

ఇక ఇతన్ని నమ్మిన ప్రజలు మూగజీవాల్లా అతని వెంట నడుస్తున్నారు.ఇలాంటి వారిని చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్త్మ చేశారట వర్ల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube