తెలుగుదేశం పార్టీలో రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది.ఎవరు ఒప్పుకున్నా.
లేకున్నా నందమూరి, నారా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే తనకు అడ్డుగా వస్తున్నాడు అని ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశాడు చంద్రబాబు, ఈ దెబ్బతో లైన్ క్లియర్ కావడంతో తన కొడుకు లోకేష్ ను పదవి పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నాడు.
అందులో భాగంగానే రానున్న మహానాడు వేదికగా లోకేష్కు పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రకటించే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తుంది.అదేవిధంగా పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించే అవకాశము లేకపోలేదు అంటున్నాయి నారా సన్నిహిత వర్గాలు.
ఇదంతా పక్కన పెడితే తెలుగు హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం సమయంలో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే ఒత్తిళ్లు చంద్రబాబు పైన వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు నారా లోకేష్కు ఆ పదవిని ఇచ్చే అవకాశముందని వార్తలు వస్తూ ఉండడంతో దీనిపై చంద్రబాబు బాలయ్య వర్గం నుంచి విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పైన లోకేష్కు పూర్తి పట్టు ఉండేలా చూడాలని నేతలు, చంద్రబాబు భారీ కసరత్తులే చేస్తున్నారు.ఇక ప్రస్తుతం లోకేష్ తెలంగాణాలో పార్టీ బలోపితం పై ప్రత్యేక దృష్టి సారించునట్లు తెలుస్తుంది.
ఏది ఏమైన బాబు లోకేష్ కోసం మున్ముందు బాలయ్యని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు.