ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.బిజెపి టిడిపి వైసిపిలు రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు అది నిజమే అనే భావన కలిగిస్తున్నాయి.
టిడిపి, జనసేన పార్టీ లు పూర్తిగా వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నాయి.ఇక జనసేన పార్టీ తో బిజెపికి పొత్తు ఉన్నా, రెండు పార్టీలు విడివిడిగానే రాజకీయ వ్యవహారాలు చేస్తుండడం, ఒకరి నిర్ణయాలకు విరుద్ధంగా మరొక పార్టీ నిర్ణయం తీసుకోవడం ఇలా రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత కనిపించడం లేదు.
దీంతో త్వరలోనే అధికారికంగా ఈ రెండు పార్టీలు పొత్తు రద్దు చేసుకోబోతున్నాయి అని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేసారు.
ఇక తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది అనే ప్రచారం కూడా చాలా రోజులుగా వస్తోంది.
దీనికి తగ్గట్లుగానే పరిస్థితి కనిపిస్తుండడంతో, ఇది నిజమనే అభిప్రాయం జనాల్లోనూ వచ్చింది.పవన్ సైతం బీజేపీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతోనే ఉన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు, దేశవ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత ఇలా అన్నిటినీ లెక్కలు వేసుకుని ఆ పార్టీకి దూరం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ,బీజేపీ మాత్రం జనసేన ను వదిలేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.బీజేపీ జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి అనే ప్రకటన బీజేపీ చేసింది.
టిడిపి మాత్రం ఏదో రకంగా జనసేన ను తమ దారిలోకి వచ్చేలా చేసుకుని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలకు వెళ్లాలని, అలాగే బిజెపి సైతం తమ కూటమిలో ఉండేలా చూసుకుంతోంది.ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే నమ్మకం లో తెలుగుదేశం పార్టీ ఉంది.అందుకే పవన్ కు మెల్లి మెల్లిగా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.కానీ బీజేపీ మాత్రం టీడీపీ కి వీలైనంత దూరంగా ఉండడమే బెటర్ అన్న అభిప్రాయంలో ఉంది.
ఒకవైపు జనసేనను వదిలేందుకు బీజేపీ ఇష్టపడకపోవడం, మరోవైపు జనసేనకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నించడం ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.