తెలంగాణాలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, గులాబీ పార్టీకి దొరికిపోయి పరువు పోగొట్టుకున్న టీడీపీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉంది.కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకూ పోటీ చేయడానికి సిద్ధమైంది.
మొత్తం 12 స్థానాలకూ గులాబీ పార్టీ తన అభ్యర్థులను నిలబెడుతుండగా, టీడీపీ కూడా అన్ని స్థానాలకు పోటీకి దిగుతోంది.టీడీపీ ఇంత ధైర్యంగా పోటీ చేస్తుండటం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయి చావుదెబ్బ తిన్న బీజేపీ మిత్ర పక్షమైన టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ హవాను తగ్గించాలని పట్టుదలగా ఉంది.పన్నెండు సీట్లకు పోటీ చేస్తే కొన్ని స్తానాలైనా దక్కుతాయని భావిస్తోంది.
ఇప్పటివరకు అయిదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన అధికార పార్టీ మిగిలినవారి పేర్లు కూడా రెడీ చేసింది.కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకు పోటీ చేస్తోంది.
తెలంగాణాలో టీడీపీ బలం తగ్గిపోయిన నేపధ్యంలో అన్ని స్థానాలకు పోటీ చేయడం సాహసమే.ఎన్ని స్థానాలు సాధిస్తుందో చూడాలి.