ఏపీ పోలీసులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం జగన్ అరాచకాలకు కొందరు పోలీసులు వంత పాడటం దుర్మార్గమని అన్నారు.
అదేవిధంగా వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, థర్డ్ డిగ్రీలతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అరాచకపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
వైసీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన పోలీసులను, వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.