2019 ఎన్నికలలో విజయం సాధించిన దగ్గర నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వం చాలా మంది టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంది.వారిపై నమోదైన కేసులు బయటకు తీసి మరి వారిని జైలు పాలు చేసింది.
ఇదంతా సాధారణంగా జరిగిన వ్యవహారమో, వైసిపి ప్రోద్బలంతో జరిగిన వ్యవహారమో తెలియదు కానీ, మొత్తానికి టిడిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.టిడిపి అధినేత చంద్రబాబు సైతం పదే పదే స్పందిస్తూ హడావుడి చేసేవారు.
ఏ నాయకుడు అయినా బాబు పెద్ద ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వచ్చారు.ఇంత వరకు బాగానే ఉన్నా, టిడిపిలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాలు యాక్టివ్ గా ఉంటున్నారు.
అఖిలప్రియ తెలంగాణలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు.ఇప్పుడు ఆమె జైలు జీవితం గడుపుతున్నారు.
కానీ ఆమె అరెస్టు పైన టిడిపి అధినేత కానీ, ఆ పార్టీ నాయకులు ఎవరూ కనీసం నోరు మెదపలేదు.
దీనిపై మీడియా ద్వారా కూడా ఆమె అరెస్టు పై సానుభూతి గానీ , ఆమె అరెస్టు అన్యాయం అని కానీ, రాజకీయ కక్ష సాధింపు అని కానీ, ఎవరూ మాట్లాడలేదు.
కొద్ది నెలల క్రితం మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర, చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వ్యవహారాల్లోనూ బాబు గట్టిగా స్పందించారు.కానీ అసలు అఖిలప్రియ వ్యవహారంలో మాత్రం మౌనంగా ఉండడం అనేక ప్రశ్నలు, అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలంగాణలో జరిగిన వ్యవహారంలో అదే తెలంగాణలో అరెస్ట్ అయ్యారు.దీంట్లో ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేదు.
కాకపోతే అఖిల ప్రియ స్వయంగా కెసిఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారం ఉండడంతో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేస్తే, ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి టిడిపి బాగా తెలుసు.
అది కూడా కిడ్నాప్ వ్యవహారం కావడం, బాధితులు స్వయంగా కేసీఆర్ బంధువులు కావడం, ఇలా రకరకాలా కారణాలతోనే టిడిపి అఖిలప్రియ విషయంలో మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ వ్యవహారాలకు అఖిల ప్రియ వర్గీయులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.కనీసం పార్టీ తరఫున ఆమె అరెస్టుపై స్పందించక పోవడం ఏంటి అంటూ టిడిపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.