ప్రతి పక్ష నాయకులు ఎప్పుడైనా అధికారంలో ఉన్నవారిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు.వారినే టార్గెట్గా చేస్తుకుని విమర్శలు గుప్పిస్తారు.
కానీ ఆంధ్రపదేశ్లో టీడీపీ నేతలు మాత్రం సీఎం జగన్పై విమర్శలు చేయడం లేదు.సీఎం జగన్ సొదరి వైఎస్ షర్మిలపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం వై ఎస్ షర్మిల మాత్రం వైసీపీతో సంబంధం లేదని, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు.కానీ టీడీపీ నేతలు మాత్రం జగన్ పై విమర్శలు చేయకుండా షర్మిషలపై విమర్శల దాడి చేస్తున్నారు.
సీఎం జగన్ను ఎదుర్కొవడానికి టీడీపీ నాయకులు షర్మిలను ముందుకు తీసుకురాడం విచిత్రంగా ఉంది.ఇటివల రాయలసీమ నేతలు నిర్వహించిన సమావేశంలో అనంతపురం పార్లమెంట్ ఇన్ చార్జి జేసీ పవన్రెడ్డి మాట్లాడుతూ.
చెల్లెలుకే న్యాయం చేయలని సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఏం చేస్తారంటూ మాట్లాడారు.సీఎం జగన్ చెల్లెలు షర్మిలకు పదవులు ఇవ్వకుండా ఆంధ్ర ప్రదేశ్ హక్కులను షర్మిలకు ఇచ్చారని పరోక్షంగా కేఆర్ ఎంబీని ఉద్దేశించి మాట్లడడం విచిత్రంగా ఉంది.
జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలని చూస్తున్న టీడీపీ నేతలకు వారి మాటాలలో లాజిక్ ఉందా లేదా అని ఆలోచించడం లేదు.షర్మిలకు పదవులు ఇవ్వడం అనేది సీఎం జగన్ సొంత విషయం.ఆ విషయంలో టీడీపీ నేతలు పదేపదే మాట్లాడడం ఆచర్యాన్ని కలిగిస్తుంది.
టీడీపీకి చెందిన నేతులు వైఎస్ షర్మిల పట్ల సానుభూతి చూపిస్తున్నారు.ఇటివల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా షర్మిలకు మద్దుగా మాట్లాడారు.ఏదో విధంగా వారు సీఎం జగన్, షర్మిల మధ్య గొడవలు రావాలనే ఉద్దేశ్యంలో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.తనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని గతంలో షర్మిల ప్రకటించారు.
అయితే ఈవిషయంలో టీడీపీ నాయకులు మాత్రం షర్మిలకు అన్యాయం చేశారని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో పదేపదే టీడీపీ నేతలు మాట్టాడడం అర్థం లేదు.