వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన రోజు రోజుకి ఎక్కువైపోతోంది.టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ నాయకులపై భారీగా విమర్శలు చేయడమే కాకుండా వారిమీద అనేక కేసులు నమోదు చేయించి ఇబ్బంది పెట్టారు.
ఇప్పుడు వైసీపీకి అధికారం దక్కడంతో పాత ఘటనలు అన్ని మనసులో పెట్టుకుని తనకు ఎక్కడ వేధిస్తారో అనే ఆలోచనలో టీడీపీ నాయకులు, కొంతమంది టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఉన్నారు.అదీ కాకుండా ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేది వీరి అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ , బీజేపీ పార్టీల్లో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ విధంగానే గుంటూరు జిల్లాలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ మంత్రిగారు వైసీపీ, ఒక వెలుగు వెలిగిన ముఖ్య నేత బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల స్వరా తెలుస్తోంది.
ఆయన బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేతతో వ్యాపార సంబంధాలు ఎప్పటి నుండో ఉన్నాయి.దీంతో.ఆయన ఇప్పుడు తన వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీలోకి వెళ్తే బెటర్ అన్న ఆలోచనలు ఉన్నదట.కాకపోతే ఆయన మాత్రం ఇదంతా వట్టిదేనని, కావాలని నాపై పుకార్లు పుట్టిస్తున్నారు అని వాపోతున్నాడు.
పైకి అలా చెబుతున్నా ఆయన మీద నమోదయిన కేసుల దృష్ట్యా పార్టీ మారకపోతే ఇబ్బంది పడతానని ఆందోళన చెందుతున్నాడట.
ఈయనే కాకుండా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు.ఆయన మైనింగ్ డాన్ గా పేరు ఉండి.ఆయన చేసిన మైనింగ్ కార్యకలాపాల మీద సీబీఐ కేసు కూడా పెండింగ్ లో ఉంది.
దీంతో వైసీపీ ప్రభుత్వం వస్తే తాను ఇరుక్కోవాల్సిందే అన్న ఆలోచనతో ముందుగానే బీజేపీలో చేరిపోయి కేసుల నుంచి తప్పించుకోవాలని సదరు నేత అనుకుంటున్నాడట.వీరే కాకుండా టీడీపీ ప్రభుత్వం లో కీ రోల్ పోషించిన వారంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టడం కాయం అని ఫిక్స్ అయిపోయి బీజేపీ, వైసీపీ పార్టీల్లో చేరేందుకు సిద్ధం అయిపోతున్నారు.
అయితే వీరిని చేర్చుకునే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో తెలియకపోయినా వైసీపీ మాత్రం ఆచి తూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.