ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ, ప్రజలను తిప్పలకు గురి చేస్తుందని, ఈ సమయంలో ప్రజలకు అండగా ఉంటూ, ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం చేయాలనే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ముందుకు కదులుతోంది.ఈ మేరకు పార్టీ శ్రేణులను ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాల్సిందిగా పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం, భవిష్యత్తు పై బెంగ పెరిగిపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు చంద్రబాబు కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలను, రాష్ట్ర కమిటీలను నియమించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు.బాబు ప్రకటించిన కమిటీలతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలోని సీనియర్ నేతలకు ఈ కమిటీలలో అవకాశం దక్కకపోవడంతో, వారంతా చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో చెమటోడ్చమని కానీ పదవుల విషయానికి వచ్చేసరికి యువ నాయకులకు , ఆర్థిక బలవంతులకు ఆ పదవి కట్టబెట్టాలని తమను పక్కనపెట్టారంటూ, పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారట.
తమ అసంతృప్తిని బహిరంగంగా తెలియజేసేందుకు వారు సిద్ధం అవుతుండడం వంటి వ్యవహారాలు బాబు దృష్టికి వెళ్లడంతో, ఆగమేఘాల మీద అసంతృప్తి నాయకులకు ఫోన్లు చేసి వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట.
ఈ మేరకు పార్టీలో మీకు ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందని, కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగానే కమిటీల నియామకాలు చేపట్టాల్సి వచ్చిందని, అర్థం చేసుకోవాలి అంటూ బాబు వారిని ప్రాధేయ పడుతూ ఉండడం వంటి వ్యవహారాలు ఎన్నో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.బాబు ఎంత బుజ్జగించినా, సీనియర్ నేతలు మాత్రం ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారట.అసలు మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కాస్త హడావుడి చేస్తున్న నాయకులకు పెద్దపీట వేయడం ఏంటని ? అసలు ఈ కమిటీల నియామకం పూర్తిగా లోకేష్ సూచనలతో నే బాబు ఈ కమిటీలను నియమించారని, సీనియర్ నేతలు అసంతృప్తి తో వున్నట్లు సమాచారం.అందుకే వారు ఇకపై పార్టీలో గతంలో మాదిరిగా యాక్టివ్ గా ఉన్నా అనవసరం అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ అసంతృప్తి ఎక్కడ వరకు దారి తీస్తుందో అని భయాందోళనలో బాబు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.