ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది.కాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు ఏకైక కుమారుడు యడ్లపాటి జయరాం నిన్న కన్నుమూశారని సమాచారం.
సుమారుగా 74 సంవత్సరాల వయసున్న జయరాం కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడట.ఈ నేపధ్యంలో నిన్న గుంటూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇకపోతే న్యాయవాది అయిన జయరాం తెనాలిలో కొన్నేళ్లపాటు లాయర్గా ప్రాక్టీస్ చేశారు.అంతే కాదు తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులుగా కూడా కొనసాగారట.ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీరిద్దరు కూడా ఆయన సహ విద్యార్థులేనట.
ఇక జయరాం మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సహా పలువురు మాజీ మంత్రులు, నేతలు సంతాపం తెలియ చేస్తూ, ఆయన మృత దేహానికి నివాళులు అర్పించారు.వీరే కాకుండా ఇతర సన్నిహితులు కూడా వీరి కుటుంబాన్ని పరమర్శించారు.
.