2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వం మరెంతో కాలం అధికారంలో ఉండదని , త్వరలోనే టిడిపి ప్రభుత్వం ఏర్పడుతుందని, మొదటి నుంచి హడావుడి చేస్తూ వస్తున్నారు.కేంద్రం నుంచి జమిలి ఎన్నికల పై స్పష్టమైన ప్రకటన రాకపోయినా, చంద్రబాబు మాత్రం తన వంతు పార్టీ లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేద్దామన్నా, జనాల్లోకి పెద్దగా అవి వెళ్ళకపోవడం వంటి కారణాలతో జమిలి ఎన్నికల జపం చేస్తూ వస్తున్నారు.
2022లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయని , పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు బాబు.అనుకున్నట్టుగానే కేంద్రం కూడా త్వరలోనే జమిలి ఎన్నికలు ఉండబోతున్నాయి అంటూ హడావుడి చేస్తోంది.దీనికి తగ్గట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల జాబితాతో పాటు, ఇతర అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునే విషయంపై దృష్టి పెట్టింది.
దీనికి తగ్గట్టుగానే ఢిల్లీ లో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి.దీంతో ఈ ఎన్నికలు ఉపయోగించుకుని రాజకీయంగా పై చేయి సాధించే విధంగా చంద్రబాబు ఇప్పటి నుంచే హడావుడి మొదలు పెట్టారు.2022 నాటికి పార్టీని పూర్తిగా పటిష్టం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పదేపదే పిలుపు ఇస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తోపాటు, తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది .ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుకుని , రానున్న రోజుల్లో అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని , పార్టీ నేతలంతా మరింత కష్టపడి టిడిపి కి విజయాన్ని అందించేందుకు కృషి చేయాలని బాబు పదేపదే పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు.జమిలి ఎన్నికలలో గట్టెక్కాలంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను, పథ కాలలోని లోపాలను , అమరావతి వ్యవహారాలను గట్టిగా హైలెట్ చేసి జనాల్లో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే విధంగా చేయాలని పార్టీ శ్రేణులు బాబు నూరిపోస్తున్నారు.