టీడీపీ నేత పట్టాభి మాజీ మంత్రి కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ లపై సీరియస్ కామెంట్ చేశారు.బినామీల పేరుతో సంకల్ప సిద్ది సంస్థను స్థాపించారని పేదల సొమ్ము కొట్టేసారని ఆరోపించారు.
కొడాలి నాని వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఒళ్ళుపల్లి రంగ సహాయంతో.గుత్తా వేణుగోపాలకృష్ణ కిరణ అనే బినామీలను పెట్టుకుని.
ఈ సంస్థను స్థాపించారని అన్నారు.ఇరవై వేలు కడితే పది నెలలలో అరవై వేలు రూపాయలు ఇస్తామని.
నమ్మించి మోసం చేశారని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గంలో పేదల సొమ్మును వల్లభనేని వంశీ దోచుకుంటున్నారని.
ఆరోపించారు.బోగస్ కంపెనీ సంకల్ప సిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వంశీ రెండు మూడు నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు.
పేదల సొమ్మును దోచుకున్న.వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని.పట్టాభి విమర్శలు చేశారు.
గన్నవరం నియోజకవర్గంలో పేదల ప్రాణాలు డయేరియాతో పోతున్నా ఎమెల్యే వంశీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.