టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతోన్నట్లు సమాచారం.
వైసీపీ గత వ్యూహాన్ని టీడీపీ అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీకి ముందుు చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.విభజన హామీలను సాధించేందుకు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించేందుకు తాను చంద్రబాబును కలిసినట్లు స్పష్టం చేశారు.