వైసీపీ పార్టీలో టిడిపి నాయకులను విమర్శించడం లో ముఖ్యంగా చంద్రబాబును అదేరీతిలో నారా లోకేష్ నీ.టార్గెట్ చేసి విమర్శించడంలో మంత్రి కొడాలి నాని ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.
వైయస్ జగన్ నీ.ఉద్దేశించి తెలుగుదేశం పార్టీకి చెందిన లేదా ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే.తనదైన శైలిలో కొడాలి నాని కౌంటర్ లు వేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా కొడాలి నాని పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
విషయంలోకి వెళితే కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి వన్ను పోటు పొడిచారని విమర్శించారు.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి.
ఇప్పుడు ఎందుకు.తోక ముడిచారు అని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అప్పుల భారం పన్నుల భారం తప్ప.ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదని అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నాగాని.ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అని.బూతులు తిట్టడం లో మాత్రం.ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని.
సెటైర్లు వేశారు.రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని.
రామ్మోహన్ నాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.