టీడీపీకి షాక్ ఇస్తున్న మురళీమోహన్! ఎన్నికలకి దూరం!

ఏపీ రాజకీయాలలో తెలుగు దేశం పార్టీలో కీలకనేతగా ఎదిగిన సినీ నటుడు మురళీ మోహన్.ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అతను తెలుగు దేశం పార్టీలోనే క్రియాశీలకంగా వుంటున్నారు.

 Tdp Mp Murali Mohan Not Interested To Contest Next Elections-TeluguStop.com

ఇక రాజమండ్రి నుంచి ఎంపీగా కూడా మురళీ మోహన్ వున్నారు.గతంలో కూడా ఎంపీగా మురళీ మోహన్ పని చేసారు.

అయితే రానున్న ఎన్నికల నుంచి తాను క్రియాశీల రాజకీయాలకి దూరంగా వుండాలని మురళీ మోహన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

మురళీ మోహన్ కి సొంతంగా వ్యాపార సంస్థలు వున్నాయి.

దీంతో రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకొని తన వ్యక్తిగత జీవితంపై ద్రుష్టి పెట్టాలని భావిస్తున్న మురళీ మోహన్ చంద్రబాబుతోనే ఈ విషయం నేరుగా చెప్పడానికి రెడీ అవుతున్నారు.అలాగే తన కోడలు రూప కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మురళీ మోహన్ చంద్రబాబుకి చెప్పే యోచనలో వున్నారని తెలుగు దేశం పార్టీ శ్రేణులలలో వినిపిస్తుంది.

అయితే రాజకీయాలకి మురళీ మోహన్ దూరంగా ఉండటానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేక పార్టీ గెలుపుపై నమ్మకాలు లేక దూరంగా వుండాలని భావిస్తున్నారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube