ఏపీ రాజకీయాలలో తెలుగు దేశం పార్టీలో కీలకనేతగా ఎదిగిన సినీ నటుడు మురళీ మోహన్.ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అతను తెలుగు దేశం పార్టీలోనే క్రియాశీలకంగా వుంటున్నారు.
ఇక రాజమండ్రి నుంచి ఎంపీగా కూడా మురళీ మోహన్ వున్నారు.గతంలో కూడా ఎంపీగా మురళీ మోహన్ పని చేసారు.
అయితే రానున్న ఎన్నికల నుంచి తాను క్రియాశీల రాజకీయాలకి దూరంగా వుండాలని మురళీ మోహన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
మురళీ మోహన్ కి సొంతంగా వ్యాపార సంస్థలు వున్నాయి.
దీంతో రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకొని తన వ్యక్తిగత జీవితంపై ద్రుష్టి పెట్టాలని భావిస్తున్న మురళీ మోహన్ చంద్రబాబుతోనే ఈ విషయం నేరుగా చెప్పడానికి రెడీ అవుతున్నారు.అలాగే తన కోడలు రూప కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మురళీ మోహన్ చంద్రబాబుకి చెప్పే యోచనలో వున్నారని తెలుగు దేశం పార్టీ శ్రేణులలలో వినిపిస్తుంది.
అయితే రాజకీయాలకి మురళీ మోహన్ దూరంగా ఉండటానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేక పార్టీ గెలుపుపై నమ్మకాలు లేక దూరంగా వుండాలని భావిస్తున్నారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.