నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగే నిమిత్తం ముందుగానే ఆయన రాజీనామా చేసాడు.వాస్తవంగా చూస్తే ఎమ్మెల్సీగా ఉన్నా… ఎమ్యెల్యేగా పోటీ చేయవచ్చు.అయితే…దీనివల్ల సీరియస్ గా ఉండదని భావించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడట.
గత ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి చంద్ర మోహన్ రెడ్డి ఓడిపోయారు.ఆ తర్వాత ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి పొందారు.అయితే శుక్రవారం సాయంత్రం …అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.2016లో గవర్నర్ కోటాలో సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే.ఆయన పదవీ కాలం 2022 వరకు ఉంది.ఈ లోపుగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశం అయ్యింది.