నిందితులను పట్టుకోలేక జగన్ కాళ్ళు పట్టుకుంటున్నాడు

ఏపీలో దేవాలయాలపై దాడులు, విగ్రహా ద్వంసం ఘటనలపై ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే టి‌డి‌పి ఎం‌ఎల్‌సి మంతెన సత్యనారాయణ జగన్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Tdp Mlc Fire On Jagan And Vellampalli Srinivas,mantha Sathynarayana-jagan-ap Pol-TeluguStop.com

ఆలయాలపై దాడులు చేసినవారిని పట్టుకునే చేతకాక జగన్ కాళ్ళు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడానికి జగన్ కు అర్హత లేదని ఆయన హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నట్లుగా మహా బాగా నటిస్తున్నాడని మంతెన అన్నాడు.

150 ఆలయాలపై దాడులు జరిగితే వైసీపీ ప్రభుత్వం మాత్రం విచారణకు ఆదేశించలేదని అన్నాడు.పోలీసు ల కంటే ముందే జగన్ ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ ఆలయాలపై దాడులను ప్రతిపక్ష నాయకులపై నెట్టేస్తున్నారు.

వాళ్లపై కేసులు పెట్టి వారిని భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నాడు.టి‌డి‌పి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు రామ తీర్థంలోని రాముడి విగ్రహం పునర్ ప్రతిష్టకు విరాళాన్ని అందిస్తే ఆ విరాళాన్ని వెనక్కి పంపి ఆయన ను అవమానించారు.

ఇలా విరాళాన్ని వెనక్కి పంపడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని మంతెన సత్యనారాయణ అన్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube